Thursday, May 16, 2024

కుముద్‌బెన్‌ జోషీ మృతికి గవర్నర్‌ సంతాపం..

అమరావతి, ఆంధ్రప్రభ: సీనియర్‌ రాజకీయ నాయకురాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో పలు పదవులు నిర్వహించిన కుముద్‌బెన్‌ జోషి మృతి పట్ల గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 1985-1990 మధ్య కాలంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా కుముద్‌బెన్‌ పనిచేశారన్నారు.

కుముద్‌బెన్‌ జోషి సీనియర్‌ రాజకీయ నేతగా, కేంద్ర మంత్రిగా రాణించారని, గుజరాత్‌ రాష్ట్రం నుండి గవర్నర్‌ పదవి చేపట్టిన మొదటి మహిళగా ఖ్యాతి గడించారన్నారు. జోషి కుటు-ంబ సభ్యులకు గవర్నర్‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement