Saturday, May 18, 2024

ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పెంపు బిల్లుకు మండలి ఆమోదం : హరీష్‌ రావు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అసెంబ్లి చివరి రోజు సమావేశాల్లో భాగంగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పెంపుపై చట్టసవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పెంపుపై చట్టసవరణ బిల్లును మంత్రి హరీష్‌రావు శాసన మండలి ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం తెలిపింది.

ఈ ఏడాదికి 4 శాతం, వచ్చే ఏడాదికి 5 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పెంపునకు సభ ఆమోదం తెలిపింది. సభలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో సభ్యులకు మంత్రి హరీష్‌ రావు ధన్యవాదాలు తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎం పెంపు కేంద్ర ప్రభుత్వం అనుమతితో, ఆర్బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారమే పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement