Sunday, April 28, 2024

గుంటూరు సిటీలో పేకాడుతున్న న‌లుగురు అరెస్టు

గుంటూరు క్రైం : గుంటూరు సిటీలో గుట్టుచప్పుడు కాకుండా ఓఇంట్లో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు అర్బన్ పోలీస్ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా రోడ్డులోని ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పట్టాభిపురం ఎస్సై విజయకుమార్ మంగళవారం సాయంత్రం ఆఇంటిపై సిబ్బందితో కలసి దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారినుంచి నాలుగు సెల్ ఫోన్లు, 18,420 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement