Saturday, May 4, 2024

రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్

సిరిసిల్ల, ప్ర‌భ‌న్యూస్ : వేములవాడ రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బుధవారం ఆలయానికి వచ్చిన సుమన్ కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ తోపాటు వేదపండితులు ఘన స్వాగతం పలికారు. బాల్క సుమన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు స్వామి వారి చిత్ర పటం తో పాటు ప్రసాదాలు అందజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApphttps://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement