Sunday, May 5, 2024

బంగారం తో ఉన్న కంటైనర్ ను ఎత్తుకు వెళ్లిన ఘరానా దొంగలు

కెనడాలో భారీ దోపిడీ జరిగింది. ఏకంగా ఎయిర్‌పోర్ట్‌ నుంచే బంగారంతో కూడిన ఓ కంటెయినర్‌ను మాయం చేశారు దుండగులు.. కెనడా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అందులో 14.8 మిలియన్‌ డాలర్ల విలువైన బంగారంతో పాటు అదనంగా విలువైన కొన్ని వస్తువులు ఉన్నాయి. ఏప్రిల్‌ 17వ తేదీ సాయంత్రం బంగారం, విలువైన వస్తువులతో కూడిన కంటెయినర్‌ టొరంటో పియర్సన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. కార్గో సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చోటుకి దీనిని తరలించారు. అక్కడి నుంచి దానిని గమ్యస్థానానికి భద్రంగా చేర్చాలని ఏర్పాట్లు చేయబోయారు. ఇంతలోనే అది మాయం అయ్యింది. ..

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీగా దీనిని అభివర్ణిస్తున్నారు అక్కడి అధికారులు. ఐదున్నర స్క్వేర్‌ ఫీట్స్‌తో ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్‌ కంటెయినర్‌ను అవలీలగా ఎత్తుకెళ్లిపోగా.. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, అన్ని చోట్లా గాలిస్తున్నట్లు పీల్‌ రీజినల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్టీఫెన్‌ దుయివెస్టెయిన్‌ ప్రకటించారు. ఇది లోకల్‌ గ్యాంగ్‌ల పనే అయ్యి ఉంటుందని అనుమానిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement