Tuesday, May 7, 2024

National | 15 రోజుల టైమివ్వండి.. కోర్టుకు రాహుల్ రిక్వెస్ట్‌

మోడీ ఇంటిపేరు కేసుకు సంబంధించి రాంచీలో ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు నుంచి 15 రోజుల సమయాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ కోరారు. కేసుకు సంబంధించిన శుక్రవారం వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ రాహుల్‌ గాంధీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన తరఫు న్యాయవాది ప్రదీప్‌ చంద్ర 15 రోజుల సమయాన్ని కోరారు. రాహుల్‌ గాంధీని వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కోర్టు ఇచ్చిన నోటీసును హైకోర్టులో సవాల్‌ చేసినట్టు ప్రదీప్‌ చంద్ర ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టుకు విన్నవించుకున్నారు. అంతకుమునుపు మే 23న కేసు విచారణ సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు మూడు వారాల సమయాన్ని కోర్టు మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement