Sunday, May 5, 2024

మీ పేరులో నీరజ్ ఉంటే పెట్రోల్ ఉచితం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన నీరజ్ చోప్రా పేరు దేశమంతటా మారుమ్రోగిపోతోంది. భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్న బంగారు పతకాన్ని నీరజ్ చోప్రా నిజం చేసి చూపించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో షూటర్ అభినవ్ బింద్రా స్వర్ణం గెలుపొందగా ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో భారత్‌కు లభించిన పసిడి పతకం ఇదే.

ఈ నేపథ్యంలోనే నీరజ్ చోప్రాకు పలువురు ఖరీదైన బహుమతులు, నజరానాలు ప్రకటిస్తున్నారు. నీరజ్ పేరు ఉన్నవారికి కొన్నిచోట్ల ఉచిత పెట్రోల్ ఆఫర్ కూడా ప్రకటించేశారు. గుజరాత్ రాష్ట్రం భారుచ్‌లోరి ఓ పెట్రోల్ బంకులో ఉచిత పెట్రోల్ ఆఫర్ ను ప్రకటించారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆఫర్ అమలులో ఉంటుంది. మీరేదో పేరు ఉన్న వ్యక్తులు ఐడి కార్డు చూపి ఉచితంగా పెట్రోలు పొందవచ్చు. అంతేకాదు జునాగఢ్ లోని గిర్నార్ రోప్ వే కంపెనీ రోజు పేరు ఉన్న వ్యక్తులకు ఉచితంగా రోప్ వేలో ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. ఈ అవకాశం ఆగస్టు 20 వరకు ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది.

ఈ వార్త కూడా చదవండి: నీరజ్ చోప్రాకు ఒక్కరోజులో 25 లక్షల మంది ఫాలోవర్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement