Sunday, May 5, 2024

అధిక వడ్డీల పేరు ప్రజలకు కుచ్చు టోపి..

ముండ్లమూరు, ప్రభన్యూస్ : మండలంలో అధిక వడ్డీలకు ఆశ పడి తమ కష్టర్జితం మొత్తము మారేళ్ళ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి ఇవ్వగా అతను చేతులు ఎత్గేసినట్లు సమాచారం. దీంతో అతనికి డబ్బులు ఇచ్చిన వారు జిల్లా ఎస్.పి మల్లిక గర్గ్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. మారేళ్ళ గ్రామ చెందిన ఎస్.సురేంద్ర తమ గ్రామం తోపాటు పరిసర గ్రామాల ప్రజలు వద్ద నుండి సుమారు రెండు కోట్ల రూపాయలు పైన వడ్డీలకు తీసుకున్నాడు.

వాటి తో సూపర్ మార్కెట్ నడుపుతున్నాడు. డబ్బులు ఇచ్చినవారు డబ్బులు అడగటంతో తన వద్ద ఇప్పుడు డబ్బులు లేవని చెప్పడా వారు ఎస్.పి ని కలిశారు. వారి పిర్యాదు మేరకు విచారణ చేయమని ముండ్లమూరు పోలీసులు ఆదేశించారు. అందులో బాగంగా స్థానిక పోలీసులు మారేళ్ళ గ్రామంలో గురువారం విచారణ చేపట్టారు. బాధితుల వద్దనుండి వివరాలు సేకరించారు. తమకు న్యాయం చేయాలని పోలిసులును బాధితులు వేడుకొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement