Saturday, April 27, 2024

సంపత్ ను సత్కరించిన మాజీ సీఎం చంద్రబాబు

జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ అవార్డు అందుకున్న ఖమ్మానికి చెందిన చావా సంపత్ కుమార్ ను అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్కరించారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడును కలవాల్సిందిగా సంపత్ కు క్యాంప్ కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా మంగళగిరి చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సంపత్ ను శాలువా, పూలమాలతో సత్కరించారు. అవార్డు వచ్చిన ఫొటోను చంద్రబాబు నిశితంగా పరిశీలించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఫొటోగ్రఫీ రంగంలో ఎన్నో అవార్డులు అందుకోవాలని సంపత్ కు చంద్రబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement