Saturday, May 4, 2024

బెస్ట్ ఆఫర్స్ తో “ఎలక్ట్రానిక్స్ సేల్”ను ప్రారంభించిన ఫ్లిప్ కార్ట్.. వివరాలివే !

దేశంలోనే అతి పెద్ద ఆన్ లైన్ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లో ఒక‌టైన‌ ఫ్లిప్ కార్ట్.. మరోక అద్బుత‌మైన‌ సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. “ఎలక్ట్రానిక్స్ సేల్” పేరుతో మరో సారి సేల్ ను ప్రారంభించింది ఫ్లిప్ కార్ట్. ఈ సేల్ నిన్న‌టి నుంచి ఏప్రిల్ 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తుంది ఈ కామ‌ర్స్ ప్లాట్ ఫామ్. అంతే కాకుండా.. క్రెడిట్ కార్డు, ఈఎంఐ ద్వారా షాపింగ్ చేసిన వారికి 10 శాతం అదనపు డిస్కౌంట్ ను కూడా అందిస్తుంది ఫ్లిప్ కార్ట్.

వీటితో పాటు బజాజ్ ఫిన్ సర్వ్ అందించే నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్, ఫ్లిప్ కార్ట్ పే లేటర్ లాంటి సర్వీసులను కూడా ఫ్లిప్ కార్ట్ అందించనుంది. ప్రతి కొనుగోలుపై కచ్చితమైన రివార్డ్ లను గెలుచుకునే అవకాశాన్ని ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది. ఈ సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాలపై 80 శాతం వరకు డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది.

ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ అందించే ఆఫర్ల వివరాలను..

పోకో ఎం4 5జీ ధర : రూ. 10,999

- Advertisement -

మోటో జీ62 ధర : రూ. 15,499

వివో టీ2 5జీ : రూ. 17,999

మోటో జీ73 ధర : రూ. 16,999

రెడ్మి నోట్ 12 ప్రో ప్లస్ 5జీ 128 జీబీ వేరియంట్ ధర : రూ. 26,499

రియల్మీ 9 ప్రో ప్లస్ 5జీ ధర : రూ. 24,999

గూగుల్ పిక్సెల్ 6ఏ ధర : రూ. 26,999

రెడ్మి నోట్ 12 ప్రో 5జీ 128 జీబీ వేరియంట్ ధర : రూ. 21,499

ఐఫోన్ 11 64 జీబీ ధర : రూ. 39,999

ఒప్పో రెనో 8 టీ ధర : రూ. 26,999

గూగుల్ పిక్సెల్ 7 ధర : రూ. 46,999

శాంసంగ్ ఎస్21 ఎఫ్ఈ 5జీ ధర : రూ. 39,999

Advertisement

తాజా వార్తలు

Advertisement