Thursday, May 2, 2024

రేపు రామ్ గోపాల్ వర్మ నిజం ఛానల్ లో ‘వివేకానంద హత్య’ ప్రసారం

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. నిజం అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబోతున్నట్లు తెలిపాడు. రేపు అంటే 25న తొలి ఎపిసోడ్ టెలీకాస్ట్ చేస్తానని వెల్లడించాడు. తాను ప్రారంభించబోయే ” నిజం” ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాల బట్టలూడదీయడానికి.. ఆ బట్టలూడదీసి విసిరి పారెస్తేనే , నిజం పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుంది’ అని ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.‘నిజం” చానల్ 1st ఎపిసోడ్ “వివేకా హత్య వెనక నిజం లో అబద్దముందా.. అనే అంశం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్మ కొత్త ఛానల్ హాట్ టాపిక్ గా మారింది. వివేకా మర్డర్ వెనక నిజం లోని అబద్ధాలు,ఆ అబద్ధాలు చెప్పే వాళ్ళ వెనక ఉన్న నిజాలు,ఆ నిజాల వెనక వేరే వాళ్ళు ప్రభోధిస్తున్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ళ పైవాళ్లు అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలు ,వాటన్నింటి వెనుక నిజాలన్నింటినీ తవ్వి తీయడమే “నిజం” ఛానల్ ముఖ్య ఉద్దేశం. అని వర్మ ట్వీట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement