Tuesday, May 28, 2024

ఢిల్లీలో టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్ చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్ పార్టీ నిరసన దీక్ష చేపట్టిన నేపథ్యంలో తెలంగాణా భవన్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్ కేంద్రాన్ని విమర్శిస్తూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయగా… వారికి కౌంటర్‌గా బీజేపీ భారీ ఎత్తున ఫ్లెక్సీలు పెట్టింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పెద్దఎత్తున కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసింది.

కేసీఆర్ తెలంగాణ రైతులను గాలికి వదిలేసి ఢిల్లీలో డ్రామాలంటూ నినాదాలు రాశారు. చేతనైతే ధాన్యం కొనుగోలు చెయ్, లేకపోతే గద్దె దిగు అంటూ బీజేపీ పెట్టిన ఫ్లెక్సీలు వివాదానికి కారణమయ్యాయి. ఆ ఫ్లెక్సీలను చూసి టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. బీజేపీ ఫ్లెక్సీలను తొలగించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement