Sunday, May 5, 2024

America: టెక్సాస్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముమ్ముడివ‌రం ఎమ్మెల్యే బంధువులు అయిదుగురి దుర్మ‌ర‌ణం

అమెరికాలోని టెక్సాస్‌ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు. జాన్సన్‌ కౌంటీ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీ కొట్టాయి. మృతులు ఆంధ్రపద్రేశ్‌లోని అమలాపురానికి చెందినవారిగా గుర్తించారు.

మృతుల్లో ముమ్మడివరం ఎమ్మె్ల్యే పొన్నాడ సతీశ్ బంధువులు ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే చిన్నాన్న నాగేశ్వర రావు కుటుంబసభ్యులుగా తెలిసింది. ప్రమాదంలో నాగేశ్వరరావు, ఆయన భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీనగంగ, మనుమడు, మనుమరాలు మృతిచెందారు. నాగేశ్వరరావు అల్లుడి లోకేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement