Saturday, May 4, 2024

Fire Accident వైశాలి ఎక్స్ ప్రెస్ లో మంట‌లు…మూడు బోగీలు ద‌గ్ధం…ప‌లువురు ప్ర‌యాణీకులకు గాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో మరో రైలు ప్రమాదం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 2.40 గంటలకు జిల్లాలోని ఫ్రెండ్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఢిల్లీ నుంచి సహరసా వెళ్తున్న వైశాలి ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రైలులోని ఎస్‌-6 బోగీ పూర్తిగా దగ్ధమయింది. మ‌రో రెండు బోగీలు పాక్షికంగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చా రు.

ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు గాయపడ్డారని, వారిని దవాఖానకు తరలించామని జిల్లా ఎస్పీ సంజయ్‌ కుమార్‌ వెల్లడించారు. కాగా, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. కాగా, ఈటావా జిల్లాలో పది గంటల వ్యవధిలో ఇది రెండో రైలు ప్రమాదం. బుధవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీ-దర్భంగా స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగడంతో మూడు కోచ్‌లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement