Monday, April 29, 2024

ఉక్కు దీక్షా శిబిరానికి మంటలు

విశాఖ: నగరంలోని జీవీఎంసీ కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం వద్ద ఉన్న ఉక్కు ఉద్యమకారుల దీక్షా శిబిరం మంటల్లో తగలబడింది. ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగినట్లు వాకర్స్‌ నుంచి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే వారు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇది ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనని.. శిబిరం వద్ద విద్యుత్‌ ప్రమాదం జరిగే అవకాశం లేదని ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు అంటున్నారు. స్టీల్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో 52 రోజులుగా జీవీఎంసీ వద్ద దీక్షలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement