Tuesday, April 30, 2024

సినీ నిర్మాత టి.జి విశ్వ ప్రసాద్ మాతృమూర్తి టి.జి గీతాంజలి కన్నుమూత

ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా అధినేత టి.జి విశ్వ ప్రసాద్ మాతృమూర్తి టి జి గీతాంజలి (70) ఇవ్వాల సాయంత్రం 6.10 నిమిషాలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే కోలుకోలేని పరిస్థితుల కారణంగా ఆవిడ చివరి కోరిక మేరకు తనయుడు విశ్వప్రసాద్ వారాణాసి తీసుకువెళ్ళారు. అక్కడే దైవ దర్శనం అనంతరం గీతాంజలి ఈరోజు తుదిశ్వాస విడిచారు. గీతాంజలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విశ్వప్రసాద్ పెద్దకొడుకు. వారణాసిలో ఆవిడ అంత్యక్రియలు జరుగుతాయని విశ్వప్రసాద్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement