Wednesday, May 8, 2024

Awards: గ‌ద్ద‌ర్ పేరుతో సినీ అవార్డులు …రేవంత్ స‌ర్కార్ కు చిరంజీవి అభినంద‌న‌లు..

ప్ర‌జాగాయ‌కుడు గద్ద‌ర్ పేరుతో సినీ అవార్డులు ప్ర‌దానం చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించ‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని క‌లిగించింద‌న‌న్నారు. నంది అవార్డుల ప్రోత్సహం అనేది చాలా ఏళ్ళు అవుతోందని.. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ఇవ్వనుండటం శుభపరిణామమన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.

హైదరాబాద్ శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహితలందరిని తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది. పుర‌స్కార గ్ర‌హీత‌ల‌కు రూ.25 ల‌క్ష‌లు న‌గ‌దు రివార్డ్ అంద‌జేసింది. ఈ సంద‌ర్భ‌గా చిరంజీవి మాట్లాడుతూ, పద్మ విభూషణ్ అవార్డు రావడం ఆనందంగా ఉందని.. గత వారం రోజులుగా అందరు వచ్చి అభిమానం చాపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి. పద్మ అవార్డుల గ్రహితలను గౌరవిస్తూ.. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మనవాళ్లలను మనం గౌరవించకోకపోతే ఎలా అని అనుకోవడం గొప్ప విషయమన్నారు. అవార్డులు ప్రకటించిన తర్వాత.. వెంటనే ఇలా సన్మానించడం ఇదే తొలిసారని.. అవార్డులు కళాకారులకు ఎంతో ప్రొత్సహాన్ని ఇస్తాయని చిరంజీవి అన్నారు.

- Advertisement -

పద్మభూషణ్ వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం.. పద్మవిభూషణ్ వచ్చినప్పుడు అంత ఉత్సాహం లేదన్నారు చిరంజీవి. తాను అవార్డుల కోసం ఎప్పుడూ ఎదురు చూడను.. అవార్డులు రావాలని కోరుకోనన్నారు. తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయన్నారు.. సభ ఇంత నిండుగా ఉందంటే.. దానికి కారణం వెంకయ్య నాయుడు.. ఆయన తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనమని.. తెలుగు భాషను గొప్పగా నిలబెట్టిన వాళ్ళలో వెంకయ్య నాయుడు ఒకరని మెగాస్టార్ చిరజీవి అన్నారు.

ప్ర‌ధాని మాట కాద‌న లేక — వెంక‌య్య నాయుడు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సాధరణంగా తనకు అవార్డులు తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండద‌ని అన్నారు… ఈ క్రమంలోనే పద్మ విభూషణ్ అవార్డును కూడా తీసుకొవద్దనుకున్నాన‌ని కానీ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలిచి అవార్డు స్వీకరించాలని కోరార‌ని చెప్పారు. ఆయన మాటను కాదనలేక పద్మ విభూషన్ అవార్డును స్వీకరించాల్సి వచ్చిందని వెంకయ్యనాయుడు అన్నారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి అని.. అతని సారధ్యంలో తెలంగాణ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని.. అభివృద్దిలో అందరికి దిక్సూచిలా మారాలని కోరారు. దీంతోపాటు అవార్డు గ్రహితలను ప్రభుత్వం సత్కరించడం శుభపరిణామం అని అంటూ రేవంత్ స‌ర్కార్ ను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement