Thursday, May 9, 2024

ఆర్టీసీ బస్సు ఢీకొని తండ్రి మృతి.. కూతురికి తీవ్రగాయాలు

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నిజామాబాద్ ప్రగతి నగర్‌ చౌరస్తాలో యాక్టివాను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో తండ్రి అక్కడికక్కడే చనిపోగా.. కూతురికి తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం ఉదయం కూరగాయలు కొనుగోలు చేసేందుకు యాక్టివా వాహనంపై బయటకు వచ్చారు. కూరగాయల మార్కెట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

కాగా ఈ ఘటనలో చనిపోయిన తండ్రి పేరు రాజారావు అని తెలుస్తోంది. కూతురు మేరీ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై నిజామాబాద్ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్త కూడా చదవండి: టీచర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా… విద్యార్థులకు ఏం చెప్పారంటే..?

Advertisement

తాజా వార్తలు

Advertisement