Wednesday, May 8, 2024

వెలిమినేడులో ఘోర రోడ్డు ప్ర‌మాదం…

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు ఓ ట్రాక్టర్‌ను ఢీకొంది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదంతో రెండు వాహనాలు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్‌ సహాయంతో వాహనాలను తొలగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగిపోవడంతో హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను చిట్యాల నుంచి భువనగిరి రోడ్డులో మళ్లిస్తున్నారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతదేహాన్ని దవాఖానకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement