Thursday, May 2, 2024

భూవివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ముచ్చిరామి గ్రామానికి చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. సెల్​ఫోన్​లో సెల్ఫీ వీడియో తీసుకుని తన సమస్యను వివరిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అతనిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోర్టు వివాదంలో ఉన్న సమయంలో పోలీసులు తనను పిలిపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధిత రైతు వాపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement