Wednesday, May 8, 2024

పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న చలి..

రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్ర‌త‌లు భారీగా పెరుగుతున్నాయి. అడవులకు నిలయమైన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో 8.5 డిగ్రీలు నమోదయింది. ఇక సంగారెడ్డి జిల్లాలో 8.8 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 9.7, నిర్మల్‌లో 10.3 డిగ్రీలు, మంచిర్యాలలో 10.5 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా హబ్సిపూర్‌లో 10 డిగ్రీలు, మెదక్‌ జిల్లా టెక్మాల్‌లో 10.4 డిగ్రీల చొప్పున నమోదయింది. జీహెచ్‌ఎంసీ శివారు ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటున్నది. ఉదయం వేళల్లో పలు ప్రాంతాలను పొగమంచు కప్పేస్తున్నది. శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతలు కొంతమేర పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement