Thursday, April 25, 2024

మాజీ డీజీపీ చనిపోయారని తప్పుడు ప్రచారం

అమరావతి: మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు చనిపోయారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో మాజీ డీజీపీ సాంబశివరావు మృతి చెందారని పోస్ట్ చేశాడు. దీంతో ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని సాంబశివరావు క్లారిటీ ఇచ్చారు. ఫేస్‌బుక్‌లో సదరు పోస్టు పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సాంబశివరావు పేర్కొన్నారు.

కాగా సదరు పోస్టు 2017లో క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. నలుగురు వ్యక్తులు ఈ పోస్టును ఆపరేట్ చేశారని, సాంబశివరావు ఐపీఎస్ అయినప్పటికీ సదరు పోస్టులో ఐఏఎస్ అని పేర్కొనడంతో దురుద్దేశపూర్వకంగానే ఈ పోస్టును క్రియేట్ చేశారు. దీంతో నిందితులపై తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సాంబశివరావు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement