Saturday, April 20, 2024

ఆస్పత్రి నుంచి ఏపీ స్పీకర్ తమ్మినేని డిశ్చార్జ్

కరోనా నుంచి కోలుకున్న అనంతరం తిరిగి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం శనివారం నాడు డిశ్చార్జ్ అయ్యారు. గత నెలలో కరోనా బారినపడిన సీతారాం ఆ తర్వాత కోలుకున్నారు. అయితే, జ్వరంతోపాటు శరీరంలో చక్కెర స్థాయి పెరగడంతో ఈ నెల ఒకటో తేదీన తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకున్నారు. తాజాగా వివిధ రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి సమస్యలు లేవని తేల్చారు. స్పీకర్ పూర్తిగా కోలుకున్నారని, ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి తెలిపారు. దీంతో ఆయనను డిశ్చార్జ్ చేసినట్టు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement