Saturday, April 20, 2024

టైమ్ ఆసుపత్రిపై కేసు నమోదు, 5 లక్షల జరిమానా..

విజయవాడ లోని టైమ్ ఆసుపత్రిపై ప్రభుత్వం కొరడా జులిపించింది. కరోనాతో చేరిన పేషెంట్ ను ఆరోగ్య శ్రీలో చేర్చకుండా డబ్బులు డిమాండ్ చేసింది టైమ్ ఆసుపత్రి. అయినప్పటికి బాధితులు 50 వేల రూపాయలు కట్టినా, లక్షన్నర డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఎమ్మెల్యే అనిల్ కు ఫిర్యాదు చేశారు. పామర్రు ఎమ్మెల్యే అనిల్ ఆస్పత్రి తీరుని నిలదీసిన..యాజమాన్యం తీరులో ఎలాంటి మార్పు రాలేదు.. దీంతో విషయాన్ని జేసీ శివశంకర్ దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే కైలా అనిల్. వెంటనే ఆసుపత్రికి చేరుకుని విషయాన్ని పరిశీలించిన జేసీ..ఆరోగ్యశ్రీ కింద బాధితులను చేర్పించి, బాధితులు కట్టిన 50 వేలు తిరిగి వెనక్కి ఇప్పించారు. ఇక ప్రభుత్వ నిబంధనలు పాటించనందుకు టైమ్స్ ఆసుపత్రిపై కేసు నమోదు చేసి 5 లక్షలు ఫైన్ విధించిన అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement