Wednesday, May 1, 2024

National : నీట్ ద‌ర‌ఖాస్తు పొడ‌గింపు… ఈనెల 16 చివ‌రి తేదీ

నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష ఆన్ లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 16 వరకు పొడిగిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) ప్రకటించింది. దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నందున గడువు పొడిగిస్తున్నట్టు ఎన్ టీఏ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్షను ఎన్ టీఏ మే 5న నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు exams.nta.ac.in వెబ్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని ఎన్ టీఏ సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement