Friday, May 17, 2024

తెలుగు నేలపై శైవమత వ్యాప్తి!

చారిత్రక యుగమున శాతవాహన, చాళుక్య, రాష్ట్ర కూట, కాకతీయ, అనంతర కాలమున హందవ సంస్కృతీ సభ్యతలకు ఆలవాలమైన తెలుగు నేలలో వివిధ రాజన్యుల ఏలుబడులలో శైవమతం పరిఢవిల్లిం ది. క్రీ.పూ.2వ శతాబ్ది నాటికే తెలుగు నేలలో శైవారాధన ఉంది. గాథా సప్త శతిలో గౌరీ, పశుపతి స్తోత్రముంది. 1వ శతాబ్దంలో శైవంలో అత్యంత ప్రాచీనమైన పాశుపత శైవాన్ని లకులీస శివాచార్యుడు స్థాపించారు. చేతి కందుతున్న చరిత్ర ఆధారంగా శ్రీముకుడు కాణ్వ రాజైన సుశర్మను వధిం చి, మగధను ఆక్రమించి, శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడని, వివిధ చరిత్రకారుల అభిప్రాయాన్ని అనుసరిం చి, శ్రీ.పూ.1వ శతాబ్దిగా స్పష్టమవుతున్నది. శ్రీముకుడు జైన మతాన్ని స్వీకరించి, అనేక ఆలయాలను నిర్మించాడు. శాతవాహన 17 వ రాజైన హాల చక్రవర్తి, సింహళ రాకుమారి లీలావతిని సప్త గోదావరీ తీరస్థ భీమేశ్వరాల యం, నేటి జగిత్యాల జిల్లాలోని వేంపెల్లి వెం కటరావుపేటలో వివాహ మాడినట్టు నాటి భీమేశ్వరాలయం ఉన్నట్లు నిరూపితమైంది.
బౌద్ధమతంలోనూ నాగదేవత అరాధన ఉంది. స్థూపాలను పెనవేసుకున్న నాగ సర్పాల చిత్రాలు ప్రధానంగా ధూళికట్ట స్థూపంపై ఐదు తలల నాగ ముచిలింద శిల్పాన్ని చూడవచ్చు. ఇక్ష్వాకు (క్రీ.శ.253- 277) రాజైన ఎహువల శాం తమూలుని సేనానియైన ఎలిశ్రీ ఏలేశ్వరం నిర్మించి, సర్వదేవాలయమనే శివాలయాన్ని నిర్మించాడు. ఆయన కాలంలో విజయపురిలో కార్తికేయ, పుష్పభద్ర స్వామి, నోడిగిరీశ్వర, దేవీ ఆలయాలు నిర్మితాలైనాయి. ఇక్ష్వాకుల కాలంలో మాతృ దేవతారాధన కూడా ఉండేది. నాగార్జున కొండలో హరీతి ఆలయం నిర్మించబడింది.
ఆలయంలో సప్తమాతృకల వద్ద గాజులను సమర్పించే వారని శాసనాధారం. వీరి కాలంలో స్కంద గణపతి, యక్షుడు, హరీతి దేవతృలను పూజించేవారు. అనం తర వాకాట రాజులలో అధికులు శైవులు. మొదటి రుద్ర సేనుడు మహా భైరవుని భక్తు డు కాగా, మొదటి పృధ్వీసేనుడు మహశ్వర భక్తుడు. క్రీ.శ. 358 నుండి 569 వరకు 210 ఏళ్ళు తెలంగాణను, ఉత్తరాంధ్రను పాలించిన విష్ణుకుండినులు నేటి మహబూ బ్‌నగర్‌ జిల్లాలోని అమ్రాబాద్‌ (అమలపురం), నల్గొండ జిల్లాలోని వలిగొండ మండ లంలోని ఇంద్రపాల నగరం. కొంతకాలం బెజవాడను రాజధానిని చేసుకున్నారు. వీరు బ్రా#హ్మణ మతావ లంబులు, శివభక్తులు. రెండవ మాధవవర్మ (క్రీ.శ.440- 495) 100కు పైగా యుద్ధాలు చేసి, విజయాలు సాధించి, ఒక్కొక్క విజయానికి గుర్తుగా కీసరగుట్టపైన ఒక లింగ ప్రతిష్ఠ చేశాడు. విజయం సాధించిన చోటల్లా రామలింగేశ్వర ఆలయం కట్టించాడు. శ్రీశైలం మల్లికార్జునునికి చంద్రగుప్తుడు అనే రాజు బంధువైన చంద్రవతి ప్రతి ష్టించినదని చెపుతున్న గుప్త మహశ్వర ఆలయ శిథిలాలు, నేటికీ శ్రీశైల ఉత్తర ద్వార క్షేత్రమైన ఉమా మహశ్వరానికి ఉత్తరాన ప్రతాప రుద్ర కోటకింద వాయవ్య మూలన రోడుకు దక్షిణాన ఉన్నాయి. శ్రీశైల మల్లికార్జునుడు విష్ణుకుండినుల కాలంలోనే బ#హుళ ప్రచారం పొందాడు. గోవిందవర్మ అనేక దేవాలయాలు కట్టించాడు. 2వ మాధవ వర్మ అనేక రామ లింగేశ్వరాలయాలు కట్టించాడు. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి తాలూ కా వేల్పూరులో, ఈ ఊరులో, కీసరగుట్టలో రామలింగేశ్వరాలయాలు నేటికీ దర్శనీయ స్థలాలే. తూర్పు చాళుక్య 2వ విజయాదిత్యుడు 108 విజయాలకు గుర్తుగా 108 భీమేశ్వరా లయాలు నిర్మించాడు. జైన మతం విష్ణుకుండినుల కాలంలోనే దాదాపు కనుమరుగు కాగా, జైన ఆలయాలు శివాలయాలైనాయి. అలంపురం విష్ణుకుండి నుల కన్నా ముందువారైన ఇక్ష్వాకుల నుంచే మనుగడలో ఉండేదని శాసనాధా రంగా ఉంది. వేములవాడ చాళుక్యులు, వేములవాడలో నిర్మించిన రాజరాజేశ్వరాలయం తెలంగాణ లోని ప్రముఖ శివాలయం. బద్దెగ (క్రీ.శ.850- 895) వేముల వాడలో బద్దిగేశ్వర (భీమేశ్వర) ఆలయాన్ని నిర్మించాడు. క్రీ.శ. 7వ శతాబ్ది శాసనంలో శివమండల దీక్ష ప్రసక్తి ఉంది. శ్రీశైలం, అలంపురం, బెజవాడ, పిఠాపురం నాటి శక్తి పూజా కేంద్రాలు.
బసవేశ్వరుడు (క్రీ.110-070) వీర శైవోద్యమాన్ని ప్రారం భించాడు. అనంతరం మల్లికార్జున పండితుడు శైవాన్ని ప్రచా రం చేశాడు. చాళుక్య భీముడు ద్రాక్షారామంలో భీమేశ్వరాల యం నిర్మించాడు. భీమవరం, పాలకొల్లు, అమరావతి ఆలయాలు చాళుక్య నిర్మాణాలే. యుద్ధ మల్లుడు బెజవాడలో కుమారస్వామి, 2వ విక్రమాదిత్యుని భార్య మహాదేవి, పట్టడ కల్‌లో శైవాలయాన్ని నిర్మించారు. రాష్ట్రకూటుల కాలంలో ఎల్లోరా గుహలు మలచబడ్డాయి. కైలాసనాథ ఏక శిలాలయం మొదటి కృష్ణుని అద్భుత సృష్టి. కాలాముఖి, కాపాలిక తెగలు ప్రచారంలోకి వచ్చాయి. కాకతీయులు కాకతి మాతదేవతా రాధకులుగా అభిప్రాయాలున్నాయి. గ్రామదేవతయైన ఏకవీ ర ఆరాధన నాడు బహుళ ప్రచారంలో ఉంది. వీరికాలంలో జైన బౌద్ధ, వీరశైవుల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. ఇందుకు భిన్నంగానే తిక్కన హరిహర తత్వాన్ని బోధిం చాడు. కాళేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేసింది 2వ ప్రోలరాజు గురువైన రామేశ్వర పండి తుడు. కాకతీయ పరిపాలనలో ధర్మపురి, అనుమకొండ, ఐనవోలు, పానగల్లు, నందికంది, శనిగరం, పుష్పగిరి, అమరావతి, సామర్లకోట, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం గొప్ప శైవక్షేత్రాలు. ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రలో కాకతీయుల కాలంలో 5500 శైవా లయాలు, 1300 వైష్ణవాలయాలు, 2400 మల్లారదేవుని గుళ్ళు… భైరవ, దుర్గ గణపతి దేవు ళ్ళవి కలిపి 4400 గుడులు ఉండేవని స్పష్టమవుతున్నది. వెలమ రాజుల కాలంలో కాళిక, దుర్గ, చండి, భద్రకాళి, మహశాసుర మర్ధిని, కట్టమైసమ్మ, ముత్యాలమ్మ, మారెమ్మ, ఏకవీ ర దేవతల ఆరాధన ఉన్నట్లు తెలుస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement