Tuesday, May 7, 2024

AP | ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పొడిగించండి.. ఎన్నికల కమిషన్‌కు టీడీపీ వినతి

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ఓటర్‌ జాబితా సవరణ ప్రక్రియను పొడిగించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఒక లేఖ రాశారు. భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో కార్యకలాపాలు స్తంభించాయని పేర్కొన్నారు. ఇంకోవైపు ఎన్నికల నిర్వాహణ అనుభవం లేని సచివాలయ సిబ్బందిని ఈ ప్రక్రియలో భాగస్వాములు చేయడం సరికాదని సూచించారు. సచివాలయ సిబ్బంది స్థానంలో రెవెన్యూ, అంగన్‌వాడీ, పంచాయతీ సిబ్బంది, ఉపాధ్యాయులను బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు (బీఎల్‌వో)గా నియమించి ఓటర్‌ జాబితా సవరణ ప్రక్రియను సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement