Saturday, May 18, 2024

ఆటో ప్ర‌మాదంపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన – చంద్రాబాబు, లోకేష్‌, సోము వీర్రాజు

స‌త్య‌సాయిజిల్లా తాడిమ‌ర్రి మండ‌లం చిల్లకొండ‌య్య‌ప‌ల్లి వ‌ద్ద ఆటో ప్ర‌మాదం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.ఈ ప్ర‌మాదంపై టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు..జాతీయ ప్రధానకార్యదర్శి లోకేశ్‌, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు.క్షతగాత్రులు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగి పడ్డ ఘటనలో 8 మంది సజీవదహనమయ్యారు.గుడ్డంపల్లికి చెందిన 10 మంది కూలీలు ఆటోలో వ్యవసాయ పనుల కోసం చిల్లకొండయ్యపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement