Saturday, May 18, 2024

పంచాయతీ భవనాలకు నిధులు కేటాయించండి.. మంత్రి ఎర్రబెల్లికి బాల్క సుమన్ వినతి

చెన్నూరు నియోజకవర్గంలోని 26 గ్రామాలకు శాశ్వత పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని గురువారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ వినతిపత్రం అందించారు. భీమారం మండలంలోని ఆరేపల్లి, పోలంపల్లి ఖాజీపల్లి, నర్సింగాపూర్, జైపూర్ మండలంలోని నర్వ, వెంకట్రావుపల్లి, కోటపల్లి మండలంలోని అన్నారం, దేవులవాడ మల్లంపేట్, నాగంపేట్, నక్కలపల్లి, పారుపల్లి, పుల్లగావ్, ఆల్గవ్, రాంపూర్, రొయ్యల పల్లి, షెట్పల్లి, సిర్స, చెన్నూరు మండలంలోని అంగ్రజ్ పల్లి, సుందర శాల, పొక్కూరు, సోమన్ పల్లి,
మందమర్రి మండలంలోని పులిమడుగు, ఆదిల్ పేట్, బొక్కల గుట్ట గ్రామాల్లో పంచాయతీ భవనాలకు నిధులు కేటాయించాలని కోరాగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వ విప్ సుమన్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement