Wednesday, May 15, 2024

Air polluation : ఢిల్లీలో 13 నుంచి 20 వ‌ర‌కూ స‌రి-బేసి విధానం

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్ర‌మాద‌క‌ర స్ధాయికి చేరింది. దీపావ‌ళికి ముందే ఢిల్లీలో వాయు కాలుష్యం ప్ర‌మాద‌క‌ర స్ధాయికి చేర‌డంతో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. న‌వంబ‌ర్ 13 నుంచి 20 వ‌ర‌కూ వాహ‌నాల రాక‌పోక‌ల‌కు సంబంధించి మ‌ళ్లీ స‌రి-బేసి విధానం అమ‌లుకానుంది.

మ‌రోవైపు నిర్మాణ ప‌నుల‌కు బ్రేక్ ఇవ్వ‌డంతో పాటు 10, 12 త‌ర‌గ‌తులు మిన‌హా మిగిలిన త‌ర‌గ‌తుల‌ను న‌వంబ‌ర్ 10 వ‌ర‌కూ నిలిపివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement