Sunday, April 28, 2024

Tirupathi – అంగన్వాడి స్టాఫ్ కు జీతాలు పెంచాలి – చింతామోహన్

తిరుపతి, నవంబర్ 6 (ప్రభ న్యూస్ బ్యూరో) – మధ్యాహ్న భోజన కార్మికులకు జీతం 6000 నుంచి ఏడు వేలకు. అలాగే అంగన్వాడి వర్కర్లకు 7000 నుంచి పదివేలకు , అదే విధంగా అంగన్వాడీ టీచర్లకు 11 .500 నుంచి 17 వేలకు జీతాలు పెంచాలని. కాంగ్రెస్ మాజీ మంత్రి మరియు ఎంపీ డాక్టర్ చింతా మోహన్ డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ నేతలు యార్లపల్లి గోపి , సావిత్రమ్మ , జావేద్ , భాస్కర్. నాగరాజ్ , పటేల్ , సమూరీ భాష తదితరులతో కలిసి చింత మోహన్ మాట్లాడుతూ. బిజెపి పార్టీ ఫండ్ కోసం కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నదని ఆరోపించారు.

దీనిపై ప్రధాని మోడీ లేక భాజాపానేత నడ్డాలు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం గా. . మన రాష్ట్ర పాలక పార్టీ చేస్తున్న సామాజిక సాధికారత బస్సుయాత్ర మొదలైనప్పటి నుండి దళితులపై దాడులు పెరిగాయన్నారు. రాయలసీమ చుట్టుపక్కల జిల్లాలలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పాలకులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement