Tuesday, May 7, 2024

Evacuated – హైతీ నుంచి భార‌తీయులు త‌ర‌లింపు

గ్యాంగ్ వార్‌తో కల్లోలంగా మారిన హైతీ దేశం నుంచి భారతీయులను తరలించేందుకు కేంద్రం ”ఆపరేషన్ ఇంద్రావతి”ని ప్రారంభించింది. కరేబియన్ దేశమైన హైతీలో సాయుధ ముఠాలు అక్కడి అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ దేశంలో ఉన్న భారతీయులను సమీపంలో డొమినికన్ రిపబ్లిక్‌కి తరలించేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు. ..

కాగా ఈ దేశంలో గ్యాంగ్ స్టర్, బార్బెక్యూగా ప్రసిద్ధి చెందిన జమ్మి చెరిజియన్ నేతృత్వంలోని సాయుధ ముఠాలు హైతీని హస్తగతం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న 12 మంది భారతీయులను సురక్షితంగా తరలించారు. హింసతో అట్టుడుకుతున్న హైతీలో పరిస్థితులను సమీక్షించి, భారతీయులను అక్కడి నుంచి తరలిస్తామని గ‌తంలోనే భార‌త విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే హైతీలో ఉంటున్న 12 మందిని స‌మీపంలోని డొమినిక్ రిప‌బ్లిక్ కు త‌ర‌లించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement