Tuesday, May 7, 2024

భ‌ద్ర‌తా బ‌ల‌గాలు-న‌క్స‌ల్స్‌ మ‌ధ్య ఎదురు కాల్పులు-హ‌త‌మ‌యిన న‌క్స‌లైట్ బుద్రామ్ మార్క‌మ్

న‌క్స‌ల్స్‌..భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి.. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. భద్రతా బలగాల కాల్పుల్లో నక్సలైట్ బుధ్రామ్ మార్కమ్‌ హతమయ్యాడు. ఈ విషయాన్ని బస్తర్ రేంజ్ ఐజీ ధ్రువీకరించారు. భద్రత బలగాల కాల్పుల్లో హతమైన మార్కమ్‌పై రూ. ఐదు లక్షల రివార్డు ఉన్నట్టుగా చెప్పారు. ప్రస్తుతం మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టామని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు.ఆ ప్రాంతంలో ఇప్పటికీ నక్సలైట్లు దాక్కున్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. హతమైన నక్సలైట్ బుధ్రామ్‌పై వివిధ నేరాలకు సంబంధించి 19 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement