Sunday, April 28, 2024

Election – నేడు ఢిల్లీ లో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నేడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా ఉదయం 11:30 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

పాంచ్ న్యాయ్’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ విడుదల చేయనున్నారు .ఇక, శనివారం రాజస్థాన్‌లోని జైపూర్, తెలంగాణలోని హైదరాబాద్‌ నగరాల్లో మెగా ర్యాలీలు నిర్వహించనున్నారు. జైపూర్‌లో జరిగే మెగా ర్యాలీలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ మేనిఫెస్టోను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. ఇక హైదరాబాద్‌లో జరిగే మెగా ర్యాలీలో రాహుల్‌ గాంధీ మేనిఫెస్టోను లాంచ్‌ చేసి ప్రసంగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement