Tuesday, April 30, 2024

Telangana – నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కెసీఆర్ పొలం బాట

హైదరాబాద్ – బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పొలంబాట కొనసాగుతున్నది. ఇటీవల నల్లగొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో గులాబీ దళపతి పర్యటించారు. నీరులేక ఎండిపోయిన పంటలను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. దీనిలో భాగంగా శుక్రవారం నాడు కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. రెండు జిల్లాలకు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. ఉదయం 8.30 గంటలకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి వెళ్తారు. 10.30 గంటలకు ముక్దుంపూర్‌ చేరుకొని ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు

మధ్యాహ్నం ఒంటిగంటకు మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నివాసంలో మధ్యాహ్నం భోజనం చేస్తారు. 2గంటలకు రాజన్న సిరిసిల్లలోని బోయినపల్లికి చేరుకుంటారు. అక్కడ నీరందక ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. శాభాష్‌పల్లి వద్ద మధ్యమానేరు జలాశయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటల వరకు మళ్లీ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకోవడంతో పర్యటన పూర్తవుతుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement