Wednesday, May 8, 2024

TS – నీటి సంపులో పడి బాలుడి మృతి

ప్రభ న్యూస్ గుమ్మడిదలనీటి సంపులో పడి రెండున్నర సంవత్సరాల బాలుడు మృతిగుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది స్థానికులకు తెలిపిన వివరాల ప్రకారం బొంతపల్లి గ్రామంలోని వీరభద్ర నగర్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి నాగరాజు ప్రీతి ల కుమారుడు రెండున్నర సంవత్సరాల పిల్లవాడు నీటి గుంతలో పడి చనిపోయాడు.

శివాన్స్ (2.5) నిన్న సాయంత్రం అందాజా ఏడున్నర సమయంలో కుక్కపిల్ల కొరకు ఆడుకుంటూ వెళ్లి నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగ్ నీళ్ల సంపు లో పడి చనిపోయినట్లు వారు తెలిపారు. ఇంటి నిర్మాణ యజమాని పప్పు వెళ్లి చూడగా అందులో శివాన్స్ మృత్యువై ఉండడంతో వైద్య నిమిత్తం ఆసుపత్రికి కి తీసుకువెళ్లాగా అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. శివాన్స్ మృతితో ఇంటిల్లి పాది శోక సముద్రంలో మునిగిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement