Sunday, May 12, 2024

60 లక్షల విద్యార్థులు పాఠశాలలకు రాబోతున్నారు : మంత్రి సబితా..

వచ్చే నెల 1 నుండి అన్ని విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఈ విషయం పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…వైద్య శాఖ 1@æ ప్రకారమే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం చేస్తున్నాం. 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు రాబోతున్నారని తెలిపారు. 17 నెలలుగా వ్యవస్థలు అన్ని అతలాకుతలం అయ్యాయని విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించామని ఇప్పుడు పాఠశాలలు తెరవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రతీ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని సీఎం కేసీఆర్ సూచించారు. అంగన్ వాడీ స్కూల్స్ కూడా ప్రారబిస్తున్నాం. డీఈవోలు అందర్ని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. సర్పంచ్, కౌన్సిలర్లు, మున్సిపల్ ఛైర్మన్, మేయర్లు అందరూ బాధ్యతగా తీసుకోవాలి అని అన్నారు.

ఇక ప్రతిరోజూ పాఠశాలల్లో ఏఏ పనులు చేశారో రాష్ట్ర అధికారులకు నివేదిక ఇవ్వాలి. కోవిడ్ పాజిటివ్ వస్తే టెస్టు లు చేసి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి అని తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారమే పాఠశాలల నిర్వహణ ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల ట్రాన్స్ పోర్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. స్కూల్ బస్ సానిటైజ్ చేయాలి. ఆటోల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పిల్లల ట్రాన్స్ పోర్టు ఉండాలి. అధికారులు అందరూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ధైర్యం కల్పించాలి. ప్రత్యక్ష తరగతులు మాత్రమే నిర్వహిస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులు మమ్మల్ని స్కూల్స్ ప్రారంభించాలని కోరుతున్నాం. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బస్సుల కండీషన్లు చూసుకోవాలి అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Advertisement

తాజా వార్తలు

Advertisement