Wednesday, May 15, 2024

WPL | యూపీ వారియర్స్‌ ముందు ఈజీ టార్గెట్ !

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో భాగంగా నేడు యూపీ వారియర్స్ – ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.

ముంబై బ్యాటర్లలో నాట్ స్కివర్-బ్రంట్ (45) పరుగులు చేసి హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది. ఇక కప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33), అమేలియా కెర్ (39), సజీవన్ సజన (22) పరుగులతో మెప్పించారు. ఇక యూపీ బౌలర్లలో చమరి అథాపత్తు 2 వికెట్లు తీయగా.. రాజేశ్వరి గయాక్వాడ్ , దీప్తి శర్మ, సైమా ఠాకోర్ చరో వికెట్ దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement