Sunday, April 28, 2024

అసోంలో వరుసగా భూ ప్రకంపణలు..

నఅసోంలో గ‌త కొన్నిరోజులుగా క్ర‌మం త‌ప్ప‌కుండా భూకంపాలు వ‌స్తున్నాయి. నిన్న అసోంలోని తేజ్‌పూర్‌లో మరోసారి స్వ‌ల్పంగా భూమి కంపించింది. కాగా తాజాగా మోరిగాంలో భూ ప్ర‌కంపణ‌లు వ‌చ్చాయి. శుక్ర‌వారం ఉద‌యం 6.13 గంట‌ల ప్రాంతంలో భూమి కంపించింద‌ని, దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 2.8గా న‌మోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మోల‌జీ (ఎన్‌సీఎస్‌) వెల్ల‌డించింది. భూకంపం వ‌ల్ల జ‌రిగిన ఆస్తి, ప్రాణ న‌ష్టానికి సంబంధించిన వివ‌రాలు ఇప్ప‌టివ‌రకు తెలియ‌రాలేదని అధికారులు తెలిపారు. కాగా, గురువారం ఉద‌యం 10.30 గంటలకు తేజ్‌పూర్ స‌మీపంలో భూమి కంపించిన విష‌యం తెలిసిందే. రిక్ట‌ర్ స్కేలుపై దీని తీవ్ర‌త 3.6గా న‌మోద‌య్యింది. బుధ‌వారం సాయంత్రం 7.22 గంట‌ల‌కు సోనిత్‌పూర్‌లో 3.5 తీవ్ర‌త‌తో భూమి కంపించింది. అదేవిధంగా ఈ నెల 3న అదే ప్రాంతంలో 3.7 తీవ్ర‌త‌త భూ ప్ర‌కంప‌ణ‌లు చోటుచేసుకున్నాయి. మే 1న (శ‌నివారం) సాయంత్రం 8.09 గంటల ప్రాంతంలో తేజ్‌పూర్‌లో భూమి కంపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement