Thursday, April 18, 2024

ఐసీసీ ర్యాంకింగ్స్ లో పంత్ హవా.. అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో ఆరోస్థానం..

భారత క్రికెట్‌ యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్ ఐసీసీ ర్యాంకింగ్స్ లోను హవా కొనసాగుతోంది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ 10 మంది బ్యాట్స్‌మన్‌ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత వికెట్‌ కీపర్‌ పంతే కావడం విశేషం. ఈ యువ బ్యాట్స్‌మెన్‌ ఇటీవల జరిగిన టెస్టు క్రికెట్‌ మ్యాచుల్లో తనదైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. భారత్‌ క్రికెట్‌ టీం బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం భారత్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ రాణించాడు. ఆఖరి మ్యాచ్‌లో సెంచరీ కొట్టి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో భారత్‌ టీం వరుసగా రెండో సిరీస్‌ నెగ్గింది. పంత్‌పై ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్‌ సాధించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement