Friday, May 17, 2024

17నుంచి ఎంసెట్‌ స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: 17వ తేదీ నుంచి ఎంసెట్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ను అధికారులు నిర్వహించనున్నారు. తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. అయితే తుదివిడతలో రాష్ట్రంలో ఇంకా 19 వేలకు పైగా ఇంజనీరింగ్‌ సీట్లు మిగిలిపోయాయి.

ఇందులో అత్యధిక సీట్లు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ సీట్లే ఉన్నాయి. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ తదితర బ్రాంచీల్లో చాలా సీట్లు మిగిలిపోయాయి. మిగిలిపోయిన అన్ని సీట్లకు ఆగస్టు 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని ఇప్పటికే షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement