Saturday, May 4, 2024

మీసం పెంచిన ధోనీ.. వైరల్‌గా మారిన ధోనీ లుక్

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ తన కొత్త లుక్‌తో వావ్ అనిపిస్తున్నాడు. కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడడంతో అతడు తన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కరోనా ఆంక్షలను ఎత్తివేయడంతో ధోనీ తన కుటుంబసభ్యులతో సిమ్లాకు వెళ్లాడు. ప్రస్తుతం సిమ్లా పర్యటనను ధోనీ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈ పర్యటనకు సంబంధించి ఓ ఫోటో బయటకొచ్చింది.

కొత్త హెయిర్ స్టైల్, మీసం కట్టుతో నయా లుక్‌లో కనిపిస్తున్నాడు. హిమాచల్‌ప్రదేశ్ సంప్రదాయ టోపీ ధరించి ఉన్న ఫోటో, జీవాతో కొండపై నిల్చుని దిగిన ఫోటులు, ధోనీ న్యూ లుక్‌ కు సంబంధించిన ఇతర ఫోటోలను సాక్షి, జీవా తమ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫోటోలను చూసి మహీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ‘బాస్ ఈజ్ సూపర్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement