Saturday, April 27, 2024

Shidri | సాయి సంస్థాన్​ నిధులను కాపాడుకుందాం.. ఆమ‌ర‌ణ నిరాహార దీక్షకు స్థానికుల మ‌ద్ద‌తు

సాయి సంస్థాన్ నిధుల‌తో దేవాలయాల నిర్మాణం చేపట్టవద్దని, సంస్థాన్​ నిధులను కాపాడుకుందామని.. ఆ నిర్ణయాన్ని సాయి సంస్థాన్ ఉపసంహరించుకోవాల‌ని కోరుతూ సంస్థాన్ మాజీ ట్ర‌స్టీ, మాజీ మేయ‌ర్ అనితా, షిర్డీ న‌గ‌ర పంచాయ‌తీ మాజీ ఉపాధ్య‌క్షుడు విజ‌య్ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌ట్టారు. ఈ దీక్ష శ‌నివారం నాటికి రెండో రోజుకు చేరింది. నిరాహారదీక్ష రెండో రోజు గ్రామస్తులతో కలిసి, రెవెన్యూ మంత్రి నామ్ రాధాకృష్ణ విఖే పాటిల్ సందర్శించారు. కాగా, నిరాహార దీక్షలను విరమించాలని కోరుతూ ఆయ‌న నిమ్మరసం అందించారు.

ఈ సందర్భంగా సాయిబాబా సంస్థాన్ తాత్కాలిక కమిటీ సభ్యుడు, కలెక్టర్ సిద్ధరామ సాలిమఠ్, అదనపు కలెక్టర్ బాలాసాహెబ్ కొలేకర్ షిర్డీ గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సంస్థ అధికారులతో పాటు జర్నలిస్టులందరూ పాల్గొన్నారు. నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన గ్రామస్తుల‌కు, పాత్రికేయులకు, సానుభూతిపరులందరికీ జగ్తాప్ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement