Monday, April 29, 2024

TS | నూతన రెవెన్యూ డివిజన్​గా ఏటూరునాగారం.. ములుగు డివిజన్​లోకి మల్లంపల్లి మండలం!

ములుగు జిల్లా ఏటూరునాగారాన్ని డివిజన్‌గా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలాలతో కలిపి కొత్త రెవెన్యూ డివిజన్‌ని ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు ములుగు రెవెన్యూ డివిజన్‌లో ఏటూరునాగారం మండలం కొనసాగగా.. స్థానిక ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్‌ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ములుగు డివిజన్‌లో గోవిందరావుపేట, వెంకటాపూర్‌, ములుగు మండలాలతో పాటు నూతనంగా ఏర్పాటయ్యే మల్లంపల్లి మండలం ఉండబోతున్నాయి. ములుగు మండలంలో అంతర్భాగంగా ఉన్న మల్లంపల్లి గ్రామాన్ని.. మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రైమరీ నోటిఫికేషన్ కూడా జారీ అయ్యింది. అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యాక మండలంగా నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement