Thursday, May 2, 2024

Press Meet – హిందూ దేశంగా మార్చేందుకే రిజ‌ర్వేష‌న్ లు ర‌ద్దు – మోదీపై రేవంత్ ఫైర్

హైద‌రాబాద్ – 2025తో ఆరెస్సెస్‌ను స్థాపించి వందేళ్లవుతుందని . ఈలోగా భారత్‌ను రిజర్వేషన్ రహిత… హిందూదేశంగా మార్చాలని ఆరెస్సెస్ ఎప్పుడో చెప్పిందని అన్నారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. . ఇందుకోసమే బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. బలహీనవర్గాలపై మోదీ, అమిత్ షా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. హైద‌రాబాద్ లోనేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, 400 లోక్ సభ స్థానాల్లో గెలిస్తే ఎవరి అవసరం లేకుండా రిజర్వేషన్లను రద్దు చేయవచ్చుననేది బీజేపీ కుట్ర అని ఆరోపించారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే బీసీ జనాభాను లెక్కించి రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు సరైన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.

అరెస్సెస్ భావజాలం… మనువాదభావజాలం కోసం బీజేపీ 400 సీట్లు కోరుతోందని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. . రిజర్వేషన్లను రద్దు చేసి హిందూ దేశంగా మార్చాలనేది బీజేపీ కుటిలయత్నమన్నారు. బీసీ రిజర్వేషన్లు పెరగాలంటే జనాభా లెక్క కావాలని… అందుకు కాంగ్రెస్ సిద్ధమన్నారు. కానీ ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. కాంగ్రెస్ ప్రశ్నలకు మోదీ, అమిత్ షాలు సమాధానం చెప్పడం లేదన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ఒక్క మాట మాట్లాడటం లేదని విమర్శించారు.

- Advertisement -

కేసీఆర్ కూడా రిజర్వేషన్ల రద్దు అంశంపై మాట్లాడటం లేదన్నారు. జైల్లో ఉన్న బిడ్డ కోసం బీజేపీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి, పోవాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి సాక్షిగా చెబుతున్నానని… పంద్రాగస్ట్ లోగా రుణమాఫీ చేస్తానని పునరుద్ఘాటించారు. హరీశ్ రావులాంటి వ్యక్తులు రాజీనామా చేస్తే పీడ పోతుందన్నారు.

మల్కాజ్‌గిరి లోక్ సభ సీటు నుంచి ఈటల రాజేందర్ గెలుస్తారని మాట్లాడిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సమర్థించడం విడ్డూరమని రేవంత్ విమర్శించారు. నిన్నటికి నిన్న మల్లారెడ్డి అత్యుత్సాహంతోనో… అమాయకంగానో ఈటెల రాజేందర్ గెలుస్తున్నాడని చెప్పాడని గుర్తు చేశారు. బీజేపీతో కనుక బీఆర్ఎస్ పార్టీకి నిజంగానే వైరం ఉంటే మల్లారెడ్డి వెంటనే కేటీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.


మల్లారెడ్డిని సస్పెండ్ చేయకపోగా… ఆయన వ్యాఖ్యలను కేటీఆర్ సమర్థించారని మండిపడ్డారు. గత లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి తనను ఓడించేందుకు 31 సమావేశాలు పెట్టారని… ఇప్పుడు ఒక్క సభ కూడా పెట్టలేదన్నారు. ఐదు స్థానాల్లో బీజేపీని గెలిపించడం కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈటల గెలుస్తారని చెప్పి మల్లారెడ్డి ఉన్నది ఉన్నట్లు చెప్పి కుండ పగులగొట్టారన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే అలా మాట్లాడితే కనీసం షోకాజ్ నోటీసు ఇవ్వలేదని… వివరణ కూడా అడగలేదన్నారు. అలాంటి కేటీఆర్ బీజేపీని ఓడిస్తానని రంకెలు వేయడం విడ్డూరమన్నారు. ఇప్పటి వరకు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లను ఏమీ అనడం లేదని, బీఆర్ఎస్ అగ్రనాయకులు కూడా ఈటెలను ఏమీ అనడం లేదన్నారు.

బకాసురుడివా గంటలు గంటలు తినడానికి

తాను మహబూబ్ నగర్‌లో తింటుంటే రెండుసార్లు కరెంట్ పోయిందని కేసీఆర్ చెబుతున్నారని… గంటలు గంటలు తినడానికి ఆయన ఏమైనా బకాసురుడా? అని ఎద్దేవా చేశారు. ఇదివరకు సూర్యాపేటలోనూ ఇలాగే చెప్పారని మండిపడ్డారు. కేసీఆర్ ఇన్ని అబద్దాలు ఆడటం ఎందుకని ప్రశ్నించారు. తాము వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేసినందుకు తిడుతున్నారా? అని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉన్న మోదీని ఏమనకుండా కష్టపడుతున్న తమను ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. జైల్లో ఉన్న కూతురు కోసం బీజేపీతో అంటకాగారన్నారు. అధికారంలో లేకుంటే చస్తామా? ఏమిటి అన్నారు రేవంత్ .

Advertisement

తాజా వార్తలు

Advertisement