Tuesday, April 30, 2024

భార్య మాస్కు వేసుకోదు.. భర్తనూ వేసుకోనివ్వదు!

కోవిడ్ వీకెండ్ లాక్‌డౌన్ ఉల్లంఘించడంతోపాటూ, మాస్క్ ధరించకుండా పోలీసులతో గొడవకు దిగిన దంపతులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ దంపతుల పేర్లు పంకజ్ దత్తా, ఆభా గుప్తా. తాను మాస్కు పెట్టుకోవాలని చెప్పినా తన భార్య వినిపించుకోలేదని భర్త పంకజ్ దత్తా తెలిపాడు. “తన భార్య మాస్కు వేసుకోదని, తననూ వేసుకోనివ్వదు” అని వ్యాఖ్యానించాడు.

కాగా, కరోనా నిబంధనలు పాటించకుండా కారులో షికారుకు వెళ్లిన ఈ జంటను పోలీసులు అడ్డుకున్నారు. మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. కర్ఫ్యూ పాస్ కూడా లేకపోవడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఫైన్ కట్టాలని కోరారు. దీంతో ఆ ఇద్దరూ రెచ్చిపోయారు. పోలీసులకు దురుసుగా సమాధానమిచ్చారు. నా భర్తకు ముద్దిస్తా… అడ్డుకుంటారా అంటూ పోలీసులపై ఫైర్ అయ్యింది సదరు మహిళ. ఈ దంపతులు పోలీసులతో గొడవపడే ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా, ఇద్దరినీ సోమవారం ఉదయం కోర్టులో హాజరు పరిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement