Wednesday, May 1, 2024

క‌థ మొత్తం డ‌బ్బు చుట్టూ తిరుగుతుంది..

ప్రణవచంద్ర, మాళవిక సతీషన్‌ అజయ్‌ గోష్‌. బిత్తిరి సత్తి, మాస్టర్‌ చక్రి. జెమిని సురేష్‌ నటిస్తున్న చిత్రం ‘దోచేవారెవరురా’. సీనియర్‌ దర్శకుడు శివ నాగేశ్వరావు దర్శకుడు. బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన సరికొత్త కామెడీ థ్రిల్లర్‌ చిత్రమిది, .ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, బెనర్జీ అతిధి పాత్రలలో కనిపించనున్నారు. ‘దోచేవారెవరురా’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు హరీష్‌ శంకర్‌ ముఖ్యఅతిథిగా విచ్చే సి -టైలర్‌ విడుదల చేయగా నటు-లు ఉత్తేజ్‌, హర్ష వర్ధన్‌, దర్శ కు లు ప్రణీత్‌లు చిత్ర యూనిట్‌ కు శుభాకాంక్షలు తెలిపా రు.


దర్శకుడు శివ నాగేశ్వరావు మాట్లాడుతూ ” ఈ కథ మొత్తం డబ్బు చుట్టూ జరుగుతుంది. ప్రస్తుత సమాజంలో ఇంటినుండి బయటికి వచ్చిన తరువాత మనల్ని రకరకాలుగా దోచుకుంటు-న్నారు. ఇది పొలిటికల్‌ సినిమా కాదు ఇందులో అన్ని రకాల ఎమోషన్స్‌ తో పాటు- ఫుల్‌ ఔట్‌ ఔట్‌ కామెడీ థ్రిల్లర్‌ కూడా ఉంటు-ంది. సస్పెన్స్‌ కామెడీ థ్రిల్లర్‌ గా ప్రేక్షకుల ముందు కువస్తోంది. ” అన్నారు. చిత్ర నిర్మాత బొడ్డు కోటేశ్వర రావు మా ట్లాడుతూ ”శివ నాగేశ్వరరావు గారి సినిమాలలో ఉన్న కామె డీ, వినోదం ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు. మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా ”దోచేవారెవరురా” సినిమా లో కూడా అంతే ఎంటర్‌-టైనింగ్‌గా ఉంటు-ంది” అని అన్నారు.
దర్శకులు హరీష్‌ శంకర్‌, నటు-డు ఉత్తేజ్‌, దర్శకుడు ప్రణీత్‌, నటుడు అజయ్‌ ఘోష్‌, హీరో ప్రణవ్‌ చంద్ర, హీరోయిన్‌ మాళవిక, ప్రణతి తదితరులు సినిమా గురించి మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement