Thursday, May 16, 2024

TS | నేటి నుంచి ట్రాఫిక్ చలానాలపై రాయితీ.. జామ్ అవుతున్న వెబ్‌సైట్ !

పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్‌ల రాయితీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం (మంగళవారం) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని వాహనదారుల పెండింగ్ ట్రాఫిక్ చలాన్ ఉన్న ఆయా వాహనాలపై 60 శాతం నుంచి 90 శాతం వరకు రాయితీని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఈరోజు జీవో విడుదలైంది.

ద్విచక్ర వాహనాలు, ఆటోలపై 80 శాతం, ఆర్టీసీ బస్సులపై 90 శాతం, కార్లు, భారీ వాహనాలపై 60 శాతం రాయితీ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తగ్గింపు నేటి నుండి జనవరి 10, 2024 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ రాయితీతో, వాహనదారులు తమ పెండింగ్ చలాన్‌లను పెద్ద ఎత్తున చెల్లించే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. అయితే పెండింగ్ చాలాన్‌లు ఉన్న వాహనదారులు ఈ రాయితీని పొందేందుకు ఒకేసారి వెబ్‌సైట్‌ను తెరవడంతో వెబ్‌సైట్ జామ్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement