Saturday, May 4, 2024

Review Meeting – లోక్ స‌భ ఎన్నిక‌లు – నాలుగు జిల్లాల ఎస్పీలతో డిఐజి సమీక్ష…

కర్నూలు, డిసెంబర్ 26, ప్రభా న్యూస్ బ్యూరో. కర్నూలు రేంజ్ కార్యాలయం లో కర్నూలు, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాల ఎస్పీలతో కర్నూలు రేంజ్ డిఐజి యస్. సెంథిల్ కుమార్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా కర్నూలు రేంజ్ డిఐజి యస్. సెంథిల్ కుమార్ మాట్లాడుతూ … 2024 లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉద్యోగుల బదిలీల పై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని కర్నూలు రేంజ్ డిఐజి సెంథిల్ కుమార్ తెలిపారు.

ఈ మేరకు పోలీసు అధికారుల బదిలీలు, ఎన్నికలతో సంబంధం ఉన్నవారు, దీర్ఘకాలంగా ఒకే చోట ఉన్నవారిని ఎన్నికల విధులలో ఉండకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. 3 ఏళ్ళుగా ఒకే జిల్లాలో ఉన్నవారిని కొనసాగించకూడదని సూచించిందన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసుశాఖలోని అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి నుంచి ఎస్సై స్థాయి వరకు డిప్యూటేషన్ లలో పని చేస్తున్న వారి ఆయా కాల పరిమితి ని బట్టి కొత్త జిల్లాల ప్రకారం జనవరి లోగా చేపట్టాల్సిన బదిలీల ప్రక్రియ పై ఆరా తీసి కర్నూలు రేంజ్ డిఐజి చర్చించారు. కర్నూలు రేంజ్ పరిధిలో గతంలో విధులు నిర్వహించిన పోలీసు అధికారుల రికార్డులను పరిగణనలోనికి తీసుకోని నివేదికలు సిద్ధం చేసి పారదర్శకంగా బదిలీలు చేపట్టాలన్నారు.

ఎన్నికల సమయం దగ్గర పడుతోందని, ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త , శాంతిభద్రతల పరిరక్షణ పై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, ముందస్తు జాగ్రత్తల చర్యలు పాటించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డిఐజి సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్,నంద్యాల జిల్లా ఎస్పీ.కె.రఘువీర్ రెడ్డి,కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ , అన్నమయ్య జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement