Saturday, April 27, 2024

వాట్సాప్ వాడని టాలీవుడ్ డైరెక్టర్!

వాట్సాప్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈరోజుల్లో వాట్సాప్‌ వాడని వాళ్లు ఉంటారా ? అసలు వాట్సాప్‌ లేకుండా ఏదైనా పని జరుగుతుందా ? సామాన్యుల నుంచి సెలెబ్రెటీలు వరకు అందరు వాట్సాప్, సోషల్ మీడియాతో టచ్ లో ఉంటారు.  కానీ అస్సలు వాట్సాప్ వాడని ప్రముఖుడు ఒకడున్నాడు. అతడే టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల. అవును.. శేఖర్ కమ్ములకు వాట్సాప్ లేదు. ఇప్పటికీ వాట్సాప్‌ వాడటం లేదట.

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన లవ్ స్టారీ మూవీ విడుదలకు సిద్దమవుతోంది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా రానా యాంకర్ గా వ్యవహారిస్తున్న ఓ షోలో డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల, హీరో నాగచైతన్య, హీరోయిన్‌ సాయిపల్లవి సందడి చేశారు. ఈ సందర్భంగానే శేఖర్ కమ్ముల వాట్సాప్ వాడడం లేదని హీరో నాగచైతన్య తెలిపాడు. ‘’కమ్ముల ఎవరినైనా సంప్రదించాలంటే ఫోన్ చేస్తాడు. లేదంటే నేరుగా మెసేజ్ పెడతాడు. అంతేతప్ప.. వాట్సాప్ మాత్రం వాడడు. అయితే ఇలా వాట్సాప్ వాడకపోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నానంటున్నాడు ‘’ అని చైతూ చెప్పాడు.

అయితే తాను కూడా వాట్సాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటా అని శేఖర్‌ కమ్ముల అనబోతుండగా.. మళ్లీ చైతూ కల్పించుకొని ‘వద్దు శేఖర్‌ మీరు ఇలాగే ఉండండి’ అనడంతో షాలో నవ్వులు పూశాయి. కాగా, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘లవ్‌స్టోరి’ ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement